తెలంగాణ

telangana

By

Published : Aug 6, 2019, 8:03 PM IST

ETV Bharat / state

బ్యాంకులో పనిచేయని సర్వర్..ఖాతాదారుల ధర్నా

పాలెం రైతులు పదిరోజులుగా బ్యాంక్​ చుట్టూ తిరుగుతున్నా... అధికారులు మాత్రం డబ్బులివ్వట్లేదు. ఎందుకని నిలదీస్తే... రోజూ ఒకటే సమాధానం చెప్తూ దాటేస్తున్నారు. నెట్​ రావట్లేదని ఓ బోర్డు రాసి పెట్టి అందర్ని తిప్పిస్తున్నారంటూ... ఖాతాదారులు రోడ్డెక్కారు.

FARMERS PROTEST FOR BANK OFFICERS REPEATED ANSWER

నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం పాలెం యూనియన్ బ్యాంక్ ముందు ఖాతాదారులు ఆందోళనకు దిగారు. పది రోజులుగా ఇంటర్​నెట్​ పని చేయట్లేదని సమాధానం చెప్తూ... బ్యాంకు చుట్టు తిప్పించుకుంటున్నారని ఖాతాదారులు మండిపడ్డారు. పింఛన్​ కోసం వచ్చిన వారిని కూడా వెనక్కి పంపించేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పింఛన్​దారులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. పది రోజులుగా ఇదే సమాధానం చెప్తూ కాలయాపన చేస్తున్నారే తప్ప సమస్యను ఎందుకు పరిష్కరించటం లేదని బ్యాంక్ అధికార్లను ఖాతాదారులు నిలదీశారు.

బ్యాంకులో పనిచేయని సర్వర్..ఖాతాదారుల ధర్నా

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details