నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం పాలెం యూనియన్ బ్యాంక్ ముందు ఖాతాదారులు ఆందోళనకు దిగారు. పది రోజులుగా ఇంటర్నెట్ పని చేయట్లేదని సమాధానం చెప్తూ... బ్యాంకు చుట్టు తిప్పించుకుంటున్నారని ఖాతాదారులు మండిపడ్డారు. పింఛన్ కోసం వచ్చిన వారిని కూడా వెనక్కి పంపించేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పింఛన్దారులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. పది రోజులుగా ఇదే సమాధానం చెప్తూ కాలయాపన చేస్తున్నారే తప్ప సమస్యను ఎందుకు పరిష్కరించటం లేదని బ్యాంక్ అధికార్లను ఖాతాదారులు నిలదీశారు.
బ్యాంకులో పనిచేయని సర్వర్..ఖాతాదారుల ధర్నా
పాలెం రైతులు పదిరోజులుగా బ్యాంక్ చుట్టూ తిరుగుతున్నా... అధికారులు మాత్రం డబ్బులివ్వట్లేదు. ఎందుకని నిలదీస్తే... రోజూ ఒకటే సమాధానం చెప్తూ దాటేస్తున్నారు. నెట్ రావట్లేదని ఓ బోర్డు రాసి పెట్టి అందర్ని తిప్పిస్తున్నారంటూ... ఖాతాదారులు రోడ్డెక్కారు.
FARMERS PROTEST FOR BANK OFFICERS REPEATED ANSWER