తమ భూముల్లో వ్యవసాయం చేసుకోకుండా అడ్డుకున్న అటవీశాఖ అధికారుల చర్యలను నిరసిస్తూ.. నాగర్ కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు.
అమ్రాబాద్లోని పలు రైతులకు చెందిన భూములను.. అటవీశాఖ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఆధ్వర్యంలో స్వాధీనపరచుకుంది. పనులు ప్రారంభించే వరకు భూములు సాగు చేసుకోవచ్చునని గతంలో వారికి హామీ ఇచ్చింది.
'టైగర్ రిజర్వ్ జోన్' పేరుతో.. ఇప్పుడు భూముల్లోనికి రానివ్వకుండా అధికారులు తమను అడ్డుకుంటున్నారని రైతులు వాపోయారు. ఇళ్లకు నోటీసులు పంపుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సాగు భూములే తమ జీవనాధారమంటున్నారు.