నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఓ కాలానికి సంబంధించిన కుటుంబ సభ్యులను స్వీయ గృహ నిర్బంధంలో ఉండాలని జిల్లా వైద్యులు, అధికారులు సూచించారు. కరోనా వైరస్ లక్షణాలున్న వ్యక్తి ప్రయాణించిన రైలు బోగీలో నాగర్ కర్నూల్కు చెందిన రెండు కుటుంబాలు వారు ఉన్నారు. విహార యాత్ర ముగించుకుని వచ్చిన వారిని అధికారులు గుర్తించారు.
రెండు కుటుంబాలకు 14రోజుల స్వీయ గృహ నిర్బంధం
కరోనా వైరస్ లక్షణాలున్న వ్యక్తి ప్రయాణించిన బోగీలో ఉన్న నాగర్కర్నూలు జిల్లా వాసులను అధికారులు 14 రోజుల గృహ నిర్బంధం చేసి.. బయటకు వెళ్లకూడదని ఆదేశించారు.
రెండు కుటుంబాలకు 14రోజుల స్వీయ గృహ నిర్బంధం
ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా వైద్య సిబ్బంది, అధికారులు వారి ఇళ్లకు చేరుకుని పలు సూచనలు చేశారు. 14 రోజులవరకు ఇంట్లోనే ఉండాలని... బయటకు వెళ్లకూడదని కుటుంబ సభ్యులను ఆదేశించారు.
ఇవీచూడండి:' స్క్రీనింగ్కు అందరూ సహకరించండి..మంత్రి గంగుల వినతి'