తెలంగాణ

telangana

'మేడారానికి డీఎస్పీ పాదయాత్ర'

By

Published : Feb 23, 2021, 12:40 PM IST

తెలంగాణ గాంధీగా సీఎం కేసీఆర్​ చరిత్రలో నిలిచిపోతారని... నిజమాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి 7వ స్పెషల్‌ బెటాలియన్‌ డీఎస్పీ ఎస్‌.విష్ణుమూర్తి అన్నారు. ఆయన పాలన సాఫీగా సాగాలని ఫిబ్రవరి 17న కరీంనగర్ నుంచి మేడారానికి పాదయాత్ర చేపట్టినట్లు పేర్కొన్నారు. దీనిలో భాగంగా ములుగు జిల్లా గోవిందరావుపేటకు చేరుకున్నారు.

Nizamabad District Dichpally 7th Special Battalion DSP S Vishnumoorthy Padayatra
'సీఎం కేసీఆర్​ తెలంగాణ గాంధీగా చరిత్రలో నిలిచిపోతారు'

నిజామాబాద్​ జిల్లా డిచ్‌పల్లి 7వ స్పెషల్‌ బెటాలియన్‌ డీఎస్పీ ఎస్‌.విష్ణుమూర్తి... కరీంనగర్​ నుంచి మేడారానికి చేపట్టిన పాదయాత్ర సోమవారం ములుగు జిల్లా గోవిందరావుపేటకు చేరుకుంది. ముఖ్యమంత్రి​ జన్మదినం సందర్భంగా ఆయన పాలన సాఫీగా సాగాలని ఫిబ్రవరి 17న మానకొండూరు నుంచి పాదయాత్ర మొదలు పెట్టినట్లు డీఎస్పీ తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్​ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. తెలంగాణ గాంధీగా చరిత్రలో నిలిచిపోతారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు, ముఖ్యమంత్రి కేసీఆర్ బాగుండాలనే ఉద్దేశంతోనే పాదయాత్ర చేపట్టినట్లు డీఎస్పీ విష్ణుమూర్తి చెప్పారు.

ఇదీ చదవండి: పోలీసుల నుంచే తప్పించుకోబోయి.. ఎస్సైనే ఢీ కొట్టాడు

ABOUT THE AUTHOR

...view details