తెలంగాణ

telangana

By

Published : Aug 27, 2019, 5:22 PM IST

ETV Bharat / state

ఆర్టీసీ బస్సు కోసం బస్టాండ్‌ ఎదుట విద్యార్థుల ఆందోళన

మేడ్చల్‌ జిల్లా మల్లంపేట్‌, శంబీపూర్ గ్రామ విద్యార్థులు సమయానికి బస్సులు రావడంలేదని బస్టాప్‌ ఎదుట ఆందోళనకు దిగారు.

ఆర్టీసీ బస్సు కోసం విద్యార్థుల ఆందోళన

మేడ్చల్‌ జిల్లాలో మల్లంపేట్, శంభీపూర్ గ్రామ విద్యార్థులు మల్లంపేట్ బస్టాప్ వద్ద ధర్నాకు దిగారు. సమయానికి ఆర్టీసీ బస్సులు రావడంలేవని, ప్రస్తుతం నడుస్తున్న బస్సులు సరిపోవడంలేవన్నారు. బస్సులో స్థలం లేక ఫూట్ బోర్డింగ్ చేస్తూ వేలాడి వెళుతున్నామని తెలిపారు. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఇదే గ్రామానికి చెందినప్పటికీ, తమ గ్రామానికి బస్సులు రావడం లేదని పేర్కొన్నారు. అనంతరం అతని వద్దకు వెళ్లి తాము పడుతున్న ఇబ్బందులు తెలిపి అదనంగా బస్సులు వేయించాలని వినతి పత్రం అందజేశారు.

ఆర్టీసీ బస్సు కోసం విద్యార్థుల ఆందోళన

ABOUT THE AUTHOR

...view details