లాక్డౌన్ మొదలైన నాటి నుంచి మల్కాజిగిరి నియోజకవర్గ పరిధిలోని ప్రతి కాలనీ, బస్తీల్లో తమ సొంత నిధులతో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేయిస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు వెల్లడించారు. గురువారం మేడ్చల్ జిల్లా అల్వాల్ వెంకటాపురం డివిజన్లోని పలు కాలనీల్లో స్వయంగా ఎమ్మెల్యే ట్రాక్టర్ ద్వారా సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేశారు.
స్వయంగా సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేసిన ఎమ్మెల్యే
కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు తమ పరిధిలో ఎమ్మెల్యేలు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు సొంత నిధులతో స్వయంగా సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేశారు.
Medchal District latest news
రాష్ట్ర సర్కారు కరోనా మహమ్మారి నివారణ కోసం పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ చర్యలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. లాక్డౌన్ సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.