మేడ్చల్ జిల్లా కాప్రా జైజవాన్ నగర్లో వెయ్యి మంది పేదలకు మంత్రులు నిత్యావసరాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, కార్పొరేటర్ పావని మణిపాల్ రెడ్డిలు పాల్గొన్నారు.
వెయ్యి మందికి నిత్యావసరాలు పంపిణీ చేసిన మంత్రులు
కరోనా నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్ జై జవాన్ నగర్లో పలువురు మంత్రులు వెయ్యి మందికి నిత్యావసరాలు పంపిణీ చేశారు.
వెయ్యి మందికి నిత్యావసరాలు పంపిణీ చేసిన మంత్రులు
కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలంటే ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని వారు సూచించారు. మే 7 వరకు లాక్డౌన్ అందరూ పాటించాలన్నారు. తెలంగాణలో పేదలకు అన్నివిధాలా ఆదుకోడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు.
ఇదీ చూడండి :పోలీసులకు హారతులు..పూలవర్షం