తెలంగాణ

telangana

నిత్యావసరాలు పంపిణీ చేసిన మేయర్

By

Published : May 19, 2020, 9:45 AM IST

విజ్ఞాన్ పాఠశాల యాజమాన్యం, రాణి రుద్రమదేవి, బొల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరుపేదలు, పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి నిజాంపేట్ మేయర్ నీలా గోపాల్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు హాజరై 300 మందికి సరకులు అందజేశారు.

mayor and corporators distributed the essentials at nizampet
నిత్యావసరాలు పంపిణీ చేసిన మేయర్, కార్పొరేటర్లు

నిజాంపేట్ మేయర్ నీలా గోపాల్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు ఆవుల పావని, జగన్ యాదవ్, కె.రాజేశ్వరి చౌదరిలు స్థానికంగా ఉన్న నిరుపేదలు, పారిశుద్ధ్య కార్మికులకు సరకులు అందజేశారు. దాతలు విజ్ఞాన్ పాఠశాల యాజమాన్యం, రాణి రుద్రమదేవి, బొల్ల శ్రీనివాస్​లు ముందుకు రావడం అభినందనీయమని మేయర్ అన్నారు.

లాక్​డౌన్ నేపథ్యంలో నిజాంపేట్ కార్పొరేషన్ పారిశుద్ధ్య కార్మికుల సేవలను ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, తెరాస నాయకులు కోలను గోపాల్ రెడ్డి, ఆవుల జగన్ యాదవ్, వెంగయ్య చౌదరి, తదితరులు పాల్గొన్నారు.

నిత్యావసరాలు పంపిణీ చేసిన మేయర్, కార్పొరేటర్లు

ఇదీ చూడండి :'బైంసా బాధితుల తరఫున న్యాయ పోరాటం చేస్తా'

ABOUT THE AUTHOR

...view details