తెలంగాణ అసెంబ్లీలో సీఏఏ, ఎన్పీఆర్, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా తీర్మానం చేయడాన్ని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా భాజపా నాయకులు తీవ్రంగా విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ అధికారాలను, పార్లమెంటు ఆమోదం పొందిన చట్టాలను తక్కువ చేయడాన్ని ఖండించారు.
సీఏఏ తీర్మానాన్ని నిరసిస్తూ ఎమ్మార్వోకు వినతిపత్రం
సీఏఏకు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీలో తీర్మానాన్ని నిరసిస్తూ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు భాజపా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. అనంతరం ఎమ్మారోకు వినతిపత్రాన్ని అందజేశారు.
సీఏఏ తీర్మానాన్ని నిరసిస్తూ ఎమ్మార్వోకు వినతిపత్రం
సీఏఏ ముస్లింలకు వ్యతిరేకంగా ఉందని చెబుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల్లో మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారంటూ కమలం నేతలు ఆరోపించారు. సీఎం వ్యాఖ్యలను నిరసిస్తూ మేడ్చల్ తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వోకు వినతిపత్రాన్ని అందజేశారు.
ఇదీ చూడండి:రాజన్న భక్తులకు కరోనా స్కానింగ్