సికింద్రాబాద్లోని చిలకలగూడ పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి మెట్టుగూడలో పీడీ యాక్ట్ కింద కేసులున్న భాగ్యరాజ్ అనే వ్యక్తి ఓ కిరాణాషాప్ వద్ద హల్చల్ చేశాడు. ఘటనలో రైల్వే ఉద్యోగి రాకేష్ అనే వ్యక్తిని కత్తితో పొడిచి దాడి చేశాడు. రక్తపు మడుగులో ఉన్న రాకేష్ను వైద్య పరీక్షల కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
పోలీసులపై కత్తితో దాడికి యత్నం..
సికింద్రాబాద్లో చిలకలగూడ వద్ద ఓ కిరాణా దుకాణంలో గొడవ జరగగా.. ఘటనలో రైల్వే ఉద్యోగి రాకేష్పై దుండగుడు కత్తితో దాడి చేశారు. అతన్ని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. నిందితుడు దాడి సమయంలో మద్యంతో పాటు డ్రగ్స్ సేవించాడని.. పోలీసులు అనుమానిస్తున్నారు.
కిరాణా షాపులో గొడవ.. రైల్వే ఉద్యోగిపై కత్తితో దాడి
నార్త్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు.. 20 నిమిషాల్లో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులపైనా రౌడీషీటర్ భాగ్యరాజ్ దాడికి యత్నించాడు. దాడి సమయంలో నిందితుడు మద్యంతో పాటు డ్రగ్స్ కూడా సేవించినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి:పత్తికి అదనంగా రూ.275 పెంచండి!