తెలంగాణ

telangana

By

Published : Mar 7, 2020, 6:45 PM IST

ETV Bharat / state

'సానుభూతి వద్దు.. సమానహక్కులు కావాలి'

ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో మెదక్​లోని బీవీఆర్​ఐటీ ఇంజినీరింగ్​ కళాశాలలో మహిళా దినోత్సవం సందర్భంగా సదస్సును ఏర్పాటు చేశారు. మహిళలంటే సానుభూతి అవసరం లేదని సమానహక్కులు కల్పించాలని కళాశాల విద్యార్థులు అన్నారు.

women's day celebrations in under the eenadu and etv at engineering collage medak narsapur
'సానుభూతి వద్దు.. సమానహక్కులు కావాలి'

పురుషులతో పాటు సమానంగా హక్కులు కల్పించాలని మహిళలు అంటున్నారు. మెదక్​ జిల్లా నర్సాపూర్​ బీవీఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో మహిళా దినోత్సవం సందర్భంగా ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని.. ఉద్యోగ, ఉపాధి రంగాల్లో మరిన్ని అవకాశాలు కల్పించాలని వారు అభిప్రాయపడ్డారు.

సమాజంలో మహిళలకు భద్రత కరవు అవవుతోందని.. తమకు సానుభూతి అవసరం లేదని సమానంగా చూస్తే సరిపోతుందని అన్నారు. మహిళల భద్రత విషయంలో ఎన్నో చట్టాలు చేస్తున్నా అవి పూర్తి స్థాయిలో అమలు కావడం లేదన్నారు.

'సానుభూతి వద్దు.. సమానహక్కులు కావాలి'

ఇదీ చూడండి:విపత్కర పరిస్థితుల్లో ఆత్మరక్షణతోనే దేశరక్షణ!

ABOUT THE AUTHOR

...view details