తెలంగాణ

telangana

ETV Bharat / state

మహిళపై అత్యాచారం ఆపై హత్య

మహిళలపై నేరాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. మదమెక్కిన కామాంధులు ఆడవారిపై పశువుల్లా రెచ్చిపోతున్నారు. మెదక్​ జిల్లా నర్సాపూర్​ మండలం అవంచలో ఓ మహిళను గుర్తుతెలియని దుండగులు అత్యాచారం చేసి హత్య చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

By

Published : Jan 19, 2020, 7:08 PM IST

a-women-brutal-murder-in-medak-district
మెదక్​ జిల్లా అవంచలో దారుణం..

మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం అవంచలో దారుణం జరిగింది. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దేవులపల్లికి చెందిన ఓ మహిళ(45) నర్సాపూర్​లో దినసరి కూలీగా పని చేస్తోంది. శనివారం నాడు ఉదయం పని కోసం నర్సాపూర్​కు వచ్చింది. తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో గుర్తుతెలియని వ్యక్తులు అవంచ సమీపంలోని రోడ్డు పక్కన ఉన్న కాలువ వద్ద ఆమెపై అత్యాచారం చేసి చీర కొంగుతో ఉరి వేసి హత్య చేశారు. ఘటన స్థలానికి చేరుకుని పోలీసులు, డాగ్ స్కాడ్​తో పరిశీలించారు. నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని సీఐ నాగయ్య తెలిపారు.

మెదక్​ జిల్లా అవంచలో దారుణం..

ABOUT THE AUTHOR

...view details