మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం అవంచలో దారుణం జరిగింది. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దేవులపల్లికి చెందిన ఓ మహిళ(45) నర్సాపూర్లో దినసరి కూలీగా పని చేస్తోంది. శనివారం నాడు ఉదయం పని కోసం నర్సాపూర్కు వచ్చింది. తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో గుర్తుతెలియని వ్యక్తులు అవంచ సమీపంలోని రోడ్డు పక్కన ఉన్న కాలువ వద్ద ఆమెపై అత్యాచారం చేసి చీర కొంగుతో ఉరి వేసి హత్య చేశారు. ఘటన స్థలానికి చేరుకుని పోలీసులు, డాగ్ స్కాడ్తో పరిశీలించారు. నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని సీఐ నాగయ్య తెలిపారు.
మహిళపై అత్యాచారం ఆపై హత్య
మహిళలపై నేరాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. మదమెక్కిన కామాంధులు ఆడవారిపై పశువుల్లా రెచ్చిపోతున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం అవంచలో ఓ మహిళను గుర్తుతెలియని దుండగులు అత్యాచారం చేసి హత్య చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మెదక్ జిల్లా అవంచలో దారుణం..