మంచిర్యాల జిల్లా చెన్నూరు స్వస్థలానికి చెందిన చకినారపు భూమయ్య కుమారులు మంచిర్యాలలో నక్షత్ర ఇంజినీరింగ్ దుకాణం నిర్వహిస్తూ జిల్లా కేంద్రంలో స్థిరపడ్డారు. భూమయ్యకు నలుగురు కుమారులు కాగా.. అందులో మూడోవాడైన చరణ్ కుమార్ 20 సంవత్సరాల కిందటే చనిపోయారు.
40 రోజుల క్రితం భూమయ్యతో పాటు రెండో కుమారుడు కిరణ్ కుమార్ అదే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులకు కరోనా సోకింది. వీరిలో చిన్నారులు వైరస్ నుంచి బయటపడగా.. భూమయ్య 15 రోజుల కిందట చనిపోయారు. కిరణ్ కుమార్ ఇప్పటి వరకు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కృత్రిమ శ్వాసతోనే చికిత్స పొందుతున్నారు. ఈ తరుణంలోనే మరో కుమారుడు కిషోర్ కుమార్కూ కరోనా సోకింది.