మహబూబ్నగర్ జిల్లా కేంద్రం సమీపంలోని అప్పన్నపల్లి వద్ద మహబూబ్నగర్- జడ్చర్ల ప్రధాన రహదారిపై రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. ప్రమాదవశాత్తు మిషన్ భగీరథ పైపు పగిలింది. దీనితో భారీ ఎత్తున నీరు విరజిమ్ముతూ... ఫౌంటెన్ను తలపిస్తోంది.
రహదారిపైకి భారీగా నీరు వెదజల్లుతుండటంతో వాహనాలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. స్పందించిన అధికారులు నీటిని నిలిపివేసి మరమ్మతులు చేపట్టారు.
ఇదీ చూడండి: 'ఒకే గదిలో అవివాహిత జంట ఉండటం నేరం కాదు'