తెలంగాణ

telangana

By

Published : Jul 19, 2019, 12:49 PM IST

ETV Bharat / state

బస్సు కోసం విద్యార్థుల ఆందోళన

మహబూబ్​నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని గూరకొండ విద్యార్థులు బస్సు సౌకర్యం కోసం రోడ్డెక్కారు.

బస్సు కోసం విద్యార్థుల ఆందోళన

మహబూబ్​నగర్ జిల్లా దేవరకద్ర మండల కేంద్రానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న గూరకొండ గ్రామం నుంచి బస్సు వేయాలని విద్యార్థులు ధర్నా నిర్వహించారు. రోజూ సుమారు 100 మంది విద్యార్థులు ఇంటర్, డిగ్రీ, పీజీ చదివేందుకు పొరుగూరు వెళ్తుంటారు. తమకు బస్సు సౌకర్యం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 8 గంటలకు బస్టాండుకు వచ్చినా 11 వరకు కళాశాలకు చేరుకోలేకపోతున్నామని వాపోయారు. నిత్యం రెండు తరగతులు నష్టపోతున్నామని..వెంటనే బస్సు సదుపాయం కల్పించాలని కోరారు.

బస్సు కోసం విద్యార్థుల ఆందోళన
ఇవీ చూడండి: వరద బీభత్సంతో రాష్ట్రాలు అతలాకుతలం

ABOUT THE AUTHOR

...view details