తెలంగాణ

telangana

'తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం'

By

Published : Dec 3, 2019, 7:37 PM IST

తెరాస హయాంలో ప్రభుత్వ ఉద్యోగులందరికీ మేలే జరుగుతుందని..తొందరపడి ప్రతిపక్షాల మాయమాటల్ని నమ్మి మోసపోవద్దని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్​నగర్ జిల్లా కేంద్రంలోని ప్రయాణ ప్రాంగణానికి వెళ్లిన ఆయన ఆర్టీసీ ఉద్యోగులతో కలిసి భోజనం చేశారు.

minister srinivas goud intract with rtc staff
'తెరాస ప్రభుత్వం ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం'

ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయంతో ఆర్టీసీ ఉద్యోగులంతా ఆనందంగా ఉన్నారని మంత్రి శ్రీనివాస్​గౌడ్​ అన్నారు. ఏటా డీజిల్ ధరలు పెరుగుతున్నా.. ఆర్టీసీ ఛార్జీలు పెంచలేదని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుత పరిస్థితిని ప్రజలు అర్థంచేసుకున్నారన్నారు. ఆర్టీసీని లాభాల బాటలో తీసుకురావడానికి ఉద్యోగులు అహర్నిశలు శ్రమించాలని సూచించారు. రాష్ట్రంలో ఒక్కొక్కటిగా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు. తమ ప్రభుత్వం ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని మంత్రి పునరుద్ఘాటించారు.

'తెరాస ప్రభుత్వం ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details