తెలంగాణ

telangana

దేశ ఐక్యతను చాటి చెప్పేలా.. 'ఫ్రీడం రన్‌'

By

Published : Mar 24, 2021, 10:34 AM IST

ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో భాగంగా.. నేడు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో 'ఫ్రీడం రన్‌' కార్యక్రమం జరుగుతోంది. మహబూబ్ నగర్ కలెక్టర్ ఎస్ వెంకట్రావు.. జిల్లా కేంద్రంలో జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.

freedom run in the part of azadi ka amrut mahostav in mahabubnagar
దేశ ఐక్యతను చాటి చెప్పేలా.. 'ఫ్రీడం రన్‌'

కేంద్రం సూచనల మేరకు.. దేశ ఐక్యతను చాటి చెప్పేలా ఆజాదీకా అమృత్ మహోత్సవాలను నిర్వహిస్తున్నామని మహబూబ్ నగర్ కలెక్టర్ ఎస్ వెంకట్రావు​ పేర్కొన్నారు. వేడుకల్లో భాగంగా.. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన 'ఫ్రీడం రన్‌' కార్యక్రమాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు.

అమరవీరుల త్యాగాలకు ఫలితంగా ఏర్పడ్డ స్వతంత్య్ర భారతంలో.. సంక్షేమాన్ని అట్టడుగున ఉన్న పేద వర్గాలకు చేరవేసేలా పని చేయాలన్నదే తమ లక్ష్యమన్నారు కలెక్టర్. స్వాతంత్య్ర ఉద్యమ ఘట్టాలను తెలుసుకోవాలని యువతకు​ సూచించారు. సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తోడ్పడాలని కోరారు. అప్పుడే మహనీయులకు సరైన నివాళులు అర్పించినట్టవుతుందన్నారు.

ఇదీ చదవండి:బడ్జెట్‌ పద్దులపై నేడూ శాసనసభలో కొనసాగనున్న చర్చ

ABOUT THE AUTHOR

...view details