మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలోని 1, 14వ వార్డుల్లో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎన్నికల ప్రచారం చేశారు. ఇంటింటికీ వెళ్లి తెరాసకే ఓటు వేయాలని కోరారు.
'తెరాసకే ఓటేయండి... కష్టం వస్తే నేను చూసుకుంటా' - 'తెరాసకే ఓటేయండి... కష్టం వస్తే నే చూసుకుంటా'
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పురపాలికలోని పలు వార్డుల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకుంటానని... తెరాసనే గెలిపించాలని కోరారు.
తెరాసను గెలిపించండి : ఎర్రబెల్లి దయాకర్ రావు
ఏ కష్టం వచ్చినా... కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. ప్రతీ ఇంటిలో సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఓటు అడిగే హక్కు తమకే ఉందని ఈ సందర్భంగా మంత్రి చెప్పుకొచ్చారు.
ఇవీ చూడండి : 'జనాభా లెక్కల్లో బీసీల జనగణన జరపాలి'