ETV Bharat / state

'జనాభా లెక్కల్లో బీసీల  జనగణన జరపాలి' - జాతీయ బీసీ కమిషన్​ తాజా వార్త

బీసీలకు చట్టసభల్లో తగు ప్రాధాన్యత కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్​. కృష్ణయ్య డిమాండ్​ చేశారు. హైదరాబాద్​లోని రాజ్​భవన్​లో గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ను కలిసి రాబోయే జనాభా లెక్కల్లో బీసీల గణనను చేపట్టి లెక్కలు వెల్లడించేలా కేంద్ర ప్రభుత్వానికి సూచించాలని విజ్ఞప్తి చేశారు .

Krishnaiah_Meet_Governer in hyderabad
'జనాభా లెక్కల్లో బీసీల గణన చేపట్టి లెక్కలు చెప్పాలి'
author img

By

Published : Jan 18, 2020, 9:29 AM IST

Updated : Jan 18, 2020, 9:35 AM IST

రాబోయే జనాభా లెక్కల్లో కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో బీసీ జనగణన చేపట్టి... లెక్కలు వెల్లడించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌. కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. ఈ విషయంపై రాజ్​భవన్​లో గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ను కలిసి కేంద్ర ప్రభుత్వానికి బీసీ జనగణన జరిగేలా సూచించాలని విజ్ఞప్తి చేశారు.

గత సంవత్సరం ఇదే అంశంపై దిల్లీలో ప్రధాని మోదీని కలిసినట్టు ఆయన తెలిపారు. ప్రధాని తమ డిమాండ్‌ పట్ల సానుకూలంగా స్పందించారని... అయినప్పటికీ జనాభా గణన చేపట్టలేదన్నారు. బీసీ జనాభా లెక్కలు చేయకపోవడం వల్ల అనేక రకాల అవరోధాలు ఎదురవుతున్నాయన్నారు.

పార్లమెంట్‌లో బీసీ బిల్లు ప్రవేశపెట్టడం వల్ల చట్టసభల్లో బీసీలకు తగు ప్రాధాన్యం కల్పించాలని కృష్ణయ్య డిమాండ్‌ చేశారు.

'జనాభా లెక్కల్లో బీసీల గణన చేపట్టి లెక్కలు చెప్పాలి'

ఇదీ చూడండి: తెలంగాణలో ప్రశాంతంగా జరిగితే.. ఏపీలో రచ్చ జరుగుతోంది..

రాబోయే జనాభా లెక్కల్లో కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో బీసీ జనగణన చేపట్టి... లెక్కలు వెల్లడించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌. కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. ఈ విషయంపై రాజ్​భవన్​లో గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ను కలిసి కేంద్ర ప్రభుత్వానికి బీసీ జనగణన జరిగేలా సూచించాలని విజ్ఞప్తి చేశారు.

గత సంవత్సరం ఇదే అంశంపై దిల్లీలో ప్రధాని మోదీని కలిసినట్టు ఆయన తెలిపారు. ప్రధాని తమ డిమాండ్‌ పట్ల సానుకూలంగా స్పందించారని... అయినప్పటికీ జనాభా గణన చేపట్టలేదన్నారు. బీసీ జనాభా లెక్కలు చేయకపోవడం వల్ల అనేక రకాల అవరోధాలు ఎదురవుతున్నాయన్నారు.

పార్లమెంట్‌లో బీసీ బిల్లు ప్రవేశపెట్టడం వల్ల చట్టసభల్లో బీసీలకు తగు ప్రాధాన్యం కల్పించాలని కృష్ణయ్య డిమాండ్‌ చేశారు.

'జనాభా లెక్కల్లో బీసీల గణన చేపట్టి లెక్కలు చెప్పాలి'

ఇదీ చూడండి: తెలంగాణలో ప్రశాంతంగా జరిగితే.. ఏపీలో రచ్చ జరుగుతోంది..

sample description
Last Updated : Jan 18, 2020, 9:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.