700 మంది ఆటో డ్రైవర్లకు నిత్యావసరాల పంపిణీ - LOCK DOWN EFFECTS
కుమురం భీం జిల్లా కాగజ్నగర్లో పరిధిలోని 700 మంది ఆటో డ్రైవర్లకు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప నిత్సావసర సరుకులు అందించారు. కష్ట కాలంలో ఉపాధి కోల్పోయిన వారికి దాతలు అండగా ఉండాలని కోరారు.

700 మంది ఆటో డ్రైవర్లకు నిత్యావసరాల పంపిణీ
లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన ఆటోడ్రైవర్లకు సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆపన్నహస్తం అందించారు. కుమురం భీం జిల్లా కాగజ్నగర్ పరిసర ప్రాంతాల్లో ఆటో నడుపుకుంటు జీవనం సాగిస్తున్న700 మంది ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరుకులతో పాటు 10 రోజులకు సరిపడా బియ్యం పంపిణీ చేశారు. కరోనా కట్టడి కోసం ప్రతీ ఒక్కరు భౌతికదూరం పాటించాలని ఎమ్మెల్యే సూచించారు. కష్టకాలంలో ఉపాధి కోల్పోయిన వారికి దాతలు అండగా ఉండాలని సూచించారు.