ముందస్తు క్రిస్మస్ వేడుకలను కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని ఫాతిమా కాన్వెంట్ హై స్కూల్లో ఘనంగా జరుపుకున్నారు. క్రీస్తు జయంతిని పురస్కరించుకుని పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలను చేపట్టారు. విద్యార్థులు ఆటపాటలతో అలరించారు. క్రీస్తు జననాన్ని వివరిస్తూ చిన్నారులు చేసిన నృత్యం అందరినీ ఆకట్టుకుంది. కార్యక్రమంలో ఫాదర్ జిజో, మదర్ జాస్మిన్, ప్రిన్సిపాల్ స్మిత తదితరులు పాల్గొన్నారు.