తెలంగాణ

telangana

ETV Bharat / state

లండన్​లో తెలుగు విద్యార్థి అదృశ్యం

లండన్‌లో తెలుగు విద్యార్థి రెండు రోజుల క్రితం అదృశ్యమయ్యారు. ఈ విషయాన్ని శ్రీహర్ష తండ్రి ఉదయ్‌ప్రతాప్‌ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.

By

Published : Aug 24, 2019, 9:29 AM IST

Updated : Aug 24, 2019, 11:55 AM IST

missing

లండన్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యమయ్యాడు. ఖమ్మం నగరానికి చెందిన శ్రీహర్ష లండన్​లో పీజీ చదువుతున్నాడు. శ్రీహర్ష తండ్రి ఉదయ్‌ప్రతాప్‌ ఖమ్మం జిల్లా భాజపా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. లండన్​లో చదువుకుంటున్న శ్రీహర్ష రెండు రోజుల నుంచి కనిపించకుండాపోయాడు. స్థానిక బీచ్‌కు సమీపంలో శ్రీహర్షకు సంబంధించిన ల్యాప్‌ట్యాప్‌ ఇతర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదృశ్యం విషయాన్ని శ్రీహర్ష తండ్రి ఉదయ్‌ప్రతాప్‌ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రం ఈ విశయమై ఆరా తీస్తోంది. శ్రీహర్ష అదృశ్యంపై కుటుంబీకులు, బంధువుల్లో ఆందోళన నెలకొంది. ఉదయ్‌ప్రతాప్​తో తెరాస ఎంపీ నామ నాగేశ్వరరావు ఫోన్​లో మాట్లాడారు. తనవంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. పార్టీలకు అతీతంగా నాయకులు వచ్చి తండ్రి ఉదయ్ ప్రతాప్ను​ పరామర్శిస్తున్నారు.

లండన్​లో తెలుగు విద్యార్థి అదృశ్యం
Last Updated : Aug 24, 2019, 11:55 AM IST

ABOUT THE AUTHOR

...view details