దిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా ఖమ్మంలో రిలయన్స్ ఎదుట విద్యార్థి, యువజన, మహిళా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేశారు. రేవతి సెంటర్లోని రిలయన్స్ మార్ట్ ఎదుట పీడీఎస్యూ, పీవైఎల్, పీవోడబ్ల్యూ కార్యకర్తలు వినూత్న నిరసన తెలిపారు. రైతు వేషంలో మెడకు ఉరితాళ్లు తగిలించుకుని నిరసన తెలిపారు.
రైతులకు మద్దతుగా ఖమ్మంలో ధర్నా
ఖమ్మంలో రిలయన్స్ ఎదుట విద్యార్థి, యువజన, మహిళా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేశారు. దిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా రైతు వేషంలో మెడకు ఉరితాళ్లు తగిలించుకుని నిరసన తెలిపారు.
రైతులకు మద్దతుగా ఖమ్మంలో ధర్నా
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంబానీ, అదానీలకు మేలు చేసే విధంగా రైతు చట్టాలు తయారు చేశారని ఆరోపించారు. రైతులకు నష్టం చేసే బిల్లులను రద్దు చేసేంత వరకు దేశంలో ప్రజలు రిలయన్స్ మార్టుల్లో వస్తువులు కొనవద్దని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి :నడిరోడ్డుపై తగలబడిన కారు.. వీడియో ఇదిగో..!