తెలంగాణ

telangana

ETV Bharat / state

ఖమ్మం జిల్లాలో పురపాలక ప్రచార జోరు

ఖమ్మం జిల్లా మధిరలో పురపాలక ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అధికార తెరాస, ప్రతిపక్ష కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నాయకులు పోటాపోటీగా ఇంటింటికి తిరుగుతూ పాదయాత్రల ద్వారా ప్రచారం చేస్తున్నారు.

By

Published : Jan 2, 2020, 5:14 PM IST

Municipal election campaign in Khammam District
ఖమ్మం జిల్లాలో పురపాలక ప్రచార జోరు

తెరాస తరపున పురపాలక ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఖమ్మం జిల్లా పరిషత్ ఛైర్మన్ లింగాల కమల్ రాజు ప్రచారం ప్రారంభించారు. ఓటర్లను కలిసి అభ్యర్థిస్తున్నారు.

మరోవైపు కాంగ్రెస్, తెదేపాతో జతకట్టి కూటమిగా ఎన్నికల బరిలో దిగేందుకు నిర్ణయించుకున్నారు. తెదేపా జిల్లా కన్వీనర్ డాక్టర్ వాసిరెడ్డి రామనాథం, జిల్లా కాంగ్రెస్ నాయకులు మల్లాది వాసు కూటమి తరపున విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

ఖమ్మం జిల్లాలో పురపాలక ప్రచార జోరు

ఇదీ చూడండి : యువకులపై పోలీసుల దాడి ఘటనలో ఐజీ ఆగ్రహం

ABOUT THE AUTHOR

...view details