తెలంగాణ

telangana

By

Published : Jun 23, 2020, 10:58 AM IST

ETV Bharat / state

ఖమ్మంపై కరోనా పంజా.. ఒక్కరోజే 12 కేసులు

ఖమ్మం జిల్లాలో కరోనా పాజిటివ్​ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. సోమవారం ఒక్కరోజే 12 కొత్త కేసులు నమోదయ్యాయి. కొవిడ్​ విస్తృతి పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు.

12 new corona cases registered in khammam district
ఖమ్మంలో పెరుగుతోన్న కరోనా విస్తృతి.. ఒక్కరోజే 12 కేసులు

ఖమ్మం జిల్లాలో కరోనా వ్యాప్తి కలకలం రేపుతోంది. తాజాగా సోమవారం ఒక్కరోజే 12 మంది ఈ వైరస్​ బారినపడ్డారు. జిల్లా కేంద్రంలోని ఎన్‌ఎస్‌టీ రోడ్డుకు చెందిన ఓ వ్యక్తికి ఇటీవల కరోనా సోకగా.. ప్రస్తుతం అతడు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొంతున్నాడు. ఈ నేపథ్యంలో అతని కుటుంబీకులు, ప్రైమరీ కాంటాక్టులు 20 మందికి పరీక్షలు నిర్వహించగా.. వారిలో మరో 8 మందికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయ్యింది.

జిల్లాలోని తల్లాడ మండలం వెంకటగిరి గ్రామానికి చెందిన ఓ చిన్నారి, ముదిగొండ మండలం మేడిపల్లికి చెందిన ఓ యువకుడు ఈ వైరస్​ బారినపడ్డారు. సత్తుపల్లి పట్టణ కేంద్రానికి చెందిన ఓ క్యాన్సర్‌ బాధితుడు హైదరాబాద్‌లో చికిత్స తీసుకుంటూ కరోనా బారినపడ్డారు. పెనుబల్లి మండలం కుప్పెనకుంట్లలో మరో మహిళకు పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఈ బాధితులందరికీ ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి ఐసోలేషన్‌లో చికిత్స అందిస్తున్నారు.

ఇదీచూడండి: సమన్వయ లోపం.. కరోనా బాధితులకు శాపం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details