తెలంగాణ

telangana

అమ్మవారికి సరస్వతి హోమం... పిల్లలకు అక్షరాభ్యాసం

By

Published : Jan 30, 2020, 3:44 PM IST

వసంత పంచమి వేడుకలు కరీంనగర్​లో ఘనంగా నిర్వహించారు. శ్రీ మహా శక్తి దేవాలయంలో సరస్వతి పూజ హోమం నిర్వహించి చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు.

vasantha panchami sake akshrabyasam in karimnagar
అమ్మవారికి సరస్వతి హోమం... పిల్లలకు అక్షరాభ్యాసం

కరీంనగర్ పట్టణంలోని శ్రీ మహా శక్తి దేవాలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సరస్వతి పూజ హోమం నిర్వహించి... వేదపండితులు పిల్లలకు అక్షరాభ్యాసం చేయించి ఆశీర్వచనాలు అందించారు.

అమ్మవారికి సరస్వతి హోమం... పిల్లలకు అక్షరాభ్యాసం

పాఠశాల, కళాశాలకు వెళ్లే విద్యార్థులు సరస్వతి అమ్మవారి ఆలయం విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులతో ఆలయ ప్రాంగణాలన్నీ కిటకిటలాడాయి.

ఇదీ చదవండి:పండ్లు అమ్ముకునే వ్యక్తికి పద్మశ్రీ.. ఎందుకంటే?

ABOUT THE AUTHOR

...view details