కరీంనగర్ జిల్లా గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లిలో తమ ఇళ్ల సమీపంలో వైకుంఠధామం నిర్మించవద్దని స్థానికులు నిరసనకు దిగారు. మధ్యాహ్నం వైకుంఠధామం నిర్మాణ పనులు ప్రారంభించడం వల్ల వివాదం మొదలైంది.
వైకుంఠధామం నిర్మించొద్దని ఆత్మహత్యాయత్నం
తమ ఇళ్ల సమీపంలో వైకుంఠధామం నిర్మించవద్దని స్థానికులు నిరసన చేపట్టారు. అయినప్పటికీ వినకుండా పనులు ప్రారంభించిన నేపథ్యంలో స్థానికులు డీజిల్ పోసుకుని ఆత్మాహుతికి ప్రయత్నించారు.
వైకుంఠధామం నిర్మించవద్దని ఆత్మహత్యాయత్నం
సమీప ఇళ్లకు చెందిన వారు ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మాహుతికి యత్నించారు. అక్కడే ఉన్న పోలీసులు నిరసనకారులను అడ్డుకున్నారు. పోలీసు బలగాల సహాయంతో నిరసన కారులను గంగాధర పోలీస్ స్టేషన్కు తరలించారు. లక్ష్మీదేవిపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటం వల్ల పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు.
ఇదీ చూడండి :మద్యం మత్తులో తోటి కూలీని హతమార్చిన వ్యక్తి