కార్యకర్తలకు తెరాస పార్టీ అండగా నిలుస్తుందని శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా) ఛైర్మన్ జీవీ రామకృష్ణ అన్నారు. నల్గొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీ పరిధిలో పర్యటించిన ఆయన అగ్ని ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన లారీ డ్రైవర్ అబ్దుల్లా కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం తరఫున వారికి ఆర్థిక సాయం అందించారు.
కార్యకర్తలకు పార్టీ అండగా నిలుస్తుంది: సుడా ఛైర్మన్ రామకృష్ణ
ఆపద సమయంలో కార్యకర్తలను తెరాస పార్టీ ఆదుకుంటుందని సుడా ఛైర్మన్ జీవీ రామకృష్ణ అన్నారు. నల్గొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీ పరిధిలో పర్యటించిన ఆయన అగ్ని ప్రమాదంలో ఇళ్లు కోల్పోయిన లారీ డ్రైవర్ అబ్దుల్లా కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు.
కార్యకర్తలకు పార్టీ అండగా నిలుస్తుంది: సుడా ఛైర్మన్ రామకృష్ణ
ఆపద కాలంలో కార్యకర్తలను పార్టీ ఆదుకుంటుందని.. ఎవరూ అధైర్యపడాల్సిన పని లేదని రామకృష్ణ అన్నారు. అనంతరం ఇటీవల మరణించిన తెరాస కార్యకర్తల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు బ్రహ్మారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఇమ్రాన్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:డబ్బు లేకుంటే ఎన్నికల్లో పోటీ చేయకూడదు: చిన్నారెడ్డి
Last Updated : Mar 21, 2021, 12:11 PM IST