కరోనా సమయంలో తాను కనబడట్లేదని దుష్ప్రచారం చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. కరీంనగర్లో కొవిడ్ చికిత్స అందించే ఆస్పత్రి సహా వివిధ ప్రాంతాల్లో పర్యటించి పీపీఈ కిట్లు, మాస్కులు అందజేసినట్లు తెలిపారు. పదవులు కాపాడుకోవడం కోసం విమర్శలు చేయడం సరికాదని పరోక్షంగా మంత్రి గంగుల కమలాకర్ను ఉద్దేశించి పేర్కొన్నారు.
కనబడట్లేదని దుష్ప్రచారం చేస్తున్నారు: బండి సంజయ్
తాను కనబడట్లేదని దుష్ప్రచారం చేస్తున్నారు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కరీంనగర్లో కొవిడ్ చికిత్స అందించే ఆస్పత్రి సహా వివిధ ప్రాంతాల్లో పర్యటించి పీపీఈ కిట్లు, మాస్కులు అందజేసినట్లు తెలిపారు. తాము ప్రజల గుండెల్లో ఉంటామని చెప్పారు.
వైద్యం అందకే మనోజ్ మృతి చెందాడు: బండి సంజయ్
Last Updated : Jun 12, 2020, 7:28 PM IST