తెలంగాణ

telangana

By

Published : Sep 6, 2019, 11:01 AM IST

ETV Bharat / state

గుమ్లాపూర్ గ్రామ రైతులను పరామర్శించిన ఎమ్మెల్సీ

తక్కువ వ్యయంతో సాగునీరు అందించే అవకాశం ఉన్నా ప్రభుత్వ నిర్లక్ష్యం చూపిస్తోందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. గాయత్రి పంప్​ హౌస్​ కింద సాగు రైతులతో సమావేశమయ్యారు.

గుమ్లాపూర్ గ్రామ రైతులను పరామర్శించిన ఎమ్మెల్సీ

కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం గుమ్లాపూర్ గ్రామ రైతులను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పరామర్శించారు. సాగునీటి కోసం కుటుంబ సమేతంగా రాస్తారోకో చేసిన రైతులతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు గాయత్రి పంప్ హౌస్ సమీపంలోనే ఉన్న సాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నామని రైతులు వాపోయారు. గుమ్లాపూర్, కాట్నపల్లి, సాంబయ్యపల్లి, మల్లన్నపల్లి తదితర గ్రామాలకు తక్కువ వ్యయంతో సాగునీరు అందించే అవకాశం ఉన్నా ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యనించారు.

గుమ్లాపూర్ గ్రామ రైతులను పరామర్శించిన ఎమ్మెల్సీ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details