తెలంగాణ

telangana

ETV Bharat / state

లక్ష్మణ్​తో భాజపా నాశనమైంది: మంత్రి కొప్పుల

రాష్ట్ర అధ్యుక్షుడిగా లక్ష్మణ్​ వచ్చినప్పటి నుంచి భాజపా నాశనమైందని మంత్రి కొప్పుల ఈశ్వర్​ ఆరోపించారు. కరీంనగర్​ జిల్లా గంగాధర వ్యవసాయ మార్కెట్​ పాలకవర్గ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు.

By

Published : Nov 7, 2019, 7:55 PM IST

కొప్పుల ఈశ్వర్​

కరీంనగర్​ జిల్లా గంగాధర వ్యవసాయ మార్కెట్​ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో మంత్రులు కొప్పుల, గంగుల, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, ఎమ్మెల్సీ లక్ష్మణరావు పాల్గొన్నారు. లక్ష్మణ్ అధ్యక్ష పదవి చేపట్టిన నాటి నుంచి భాజపా నాశనమైందని మంత్రి కొప్పుల ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో 105 చోట్ల డిపాజిట్​ కోల్పోయారని అన్నారు. తాజాగా హుజూర్​నగర్ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి కన్నా 100 ఓట్లు తక్కువ పొందారని విమర్శించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పదేపదే అబద్ధాలు వల్లే వేస్తున్నారని ఆరోపించారు.

లక్ష్మణ్​తో భాజపా నాశనమైంది: మంత్రి కొప్పుల

ABOUT THE AUTHOR

...view details