తెలంగాణ

telangana

ETV Bharat / state

లాక్‌డౌన్‌ను పాటిద్దాం... కరోనాను నిర్మూలిద్దాం

కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన లాక్​డౌన్​ను ప్రతి ఒక్కరూ పాటించాలని కరీంనగర్​ జిల్లా తిమ్మాపూర్ రూరల్ సీఐ మహేష్ గౌడ్ అన్నారు.

By

Published : Apr 13, 2020, 12:08 AM IST

essential-goods-supplied-for-poor-peoples-in-karimnagar-district
లాక్‌డౌన్‌ను పాటిద్దాం... కరోనాను నిర్మూలిద్దాం

కరీంనగర్ జిల్లా శాతవాహన లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసరాలు, మాస్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి తిమ్మాపూర్​ రూరల్​ సీఐ మహేశ్ గౌడ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

కరోనా వైరస్​ను ఎదుర్కొనేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న లాక్​డౌన్​ను ప్రతి ఒక్కరూ పాటించాలని ఆయన కోరారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అన్ని సౌకర్యాలను చేపడుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ స్వీయ రక్షణ చర్యల్లో భాగంగా భౌతిక దూరం పాటించాలని సూచించారు. అలాగే వ్యక్తిగత శుభ్రతను పాటించాలని వివరించారు.

ఇదీ చూడండి:కుమారుడి అంత్యక్రియలకు 2,000 కి.మీ ప్రయాణం

ABOUT THE AUTHOR

...view details