తెలంగాణ

telangana

By

Published : Jul 10, 2019, 1:02 AM IST

ETV Bharat / state

రైతుల సమస్యలపై డీఎస్పీ సమావేశం

కామారెడ్డి జిల్లా మద్నూర్​లో రైతుల సమస్యలపై రైతు సంఘాలతో డీఎస్పీ సమావేశం నిర్వహించారు. గ్రామంలో విద్యుత్తు నియంత్రికలు చోరీ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. గ్రామాల్లోకి కొత్త వ్యక్తులు వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ సూచించారు.

రైతుల సమస్యలపై డీఎస్పీ సమావేశం

రైతుల సమస్యలపై పోలీసులు సమావేశం నిర్వహించారు. కామారెడ్డి జిల్లా మద్నూర్​లో డీఎస్పీ యాదగిరి ఆధ్వర్యంలో రైతులు, రైతు సంఘాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. విద్యుత్తు నియంత్రికలు చోరీలు కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని రైతులు కోరారు. మండలంలో గత కొంత కాలంగా విద్యుత్తు నియంత్రికల చోరీలు పెరిగిపోయినట్లు పేర్కొన్నారు. గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని డీఎస్పీ సూచించారు.

రైతుల సమస్యలపై డీఎస్పీ సమావేశం

ABOUT THE AUTHOR

...view details