తెలంగాణ

telangana

By

Published : Dec 11, 2020, 3:16 PM IST

ETV Bharat / state

'రైతులకు, మహిళలకు తెరాస ప్రభుత్వం పెద్దపీట'

జోగులంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం పెద్దపాడులో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కృష్టమోహన్​ ప్రారంభించారు. రైతులు, మహిళల సంక్షేమం కోసం తెరాస సర్కారు కృషి చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.

mla krishnamohan reddy started development programs in peddapadu
mla krishnamohan reddy started development programs in peddapadu

జోగులంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం పెద్దపాడులో ఎమ్మెల్యే కృష్టమోహన్​ పర్యటించారు. రూ. 15 లక్షల వ్యయంతో నిర్మించిన వైకుంఠధామం, శాంటిగ్రేషన్​షెడ్​లను ఎమ్మెల్యే ప్రారంభించారు. మనిషి జన్మించిన తర్వాత చేరుకొనే చివరి పుణ్యస్థలమే వైకుంఠధామమని ఎమ్మెల్యే అభివర్ణించారు. 50 ఏళ్లు కాంగ్రెస్​... 20 ఏళ్లు తెదేపా పాలించినా... కనీసం గ్రామాల్లో వైకుంఠధామలను కూడా నిర్మించలేరని మండిపడ్డారు.

రైతులకు, మహిళలకు తెరాస ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని వివరించారు. సంక్షేమ పథకాలు అమలుచేస్తూ... రైతుల పక్షపాతిగా నిలిచిన కేసీఆర్​కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఇదీ చూడండి: వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు మొరాయిస్తున్న సర్వర్లు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details