తెలంగాణ

telangana

అలంపూర్‌లో తుంగభద్ర పుష్కరాలపై ఎమ్మెల్యే సమీక్ష

By

Published : Jul 22, 2020, 8:02 PM IST

తుంగభద్ర పుష్కరాలు తెలంగాణలో కేవలం అలంపూర్ నియోజకవర్గంలో మాత్రమే జరగనున్నాయని అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహం తెలిపారు. ఈ పుష్కరాలపై అలంపూర్‌లో దేవాదయ శాఖ అధికారులతో సమీక్షించారు. రేనేవేషన్, లైటింగ్ సిస్టం, బార్ కేడింగ్, పెయింటింగ్, ఫ్లోరింగ్ పనులపై చర్చించారు.

అలంపూర్‌లో తుంగభద్ర పుష్కరాలపై ఎమ్మెల్యే సమీక్ష
అలంపూర్‌లో తుంగభద్ర పుష్కరాలపై ఎమ్మెల్యే సమీక్ష

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దేవాదాయ శాఖ అధికారులతో తుంగభద్ర పుష్కరాల ఏర్పాట్లపై ఎమ్మెల్యే అబ్రహం సమీక్షించారు. తుంగభద్ర పుష్కరాలు తెలంగాణలో కేవలం అలంపూర్ నియోజకవర్గంలో మాత్రమే జరగనున్నాయని తెలిపారు. వాటికి సంబంధించి రేనేవేషన్, లైటింగ్ సిస్టం, బార్ కేడింగ్, పెయింటింగ్, ఫ్లోరింగ్ పనులపై చర్చించారు.

నియోజకవర్గం లో ఉన్న దేవాలయ భూములను సంరక్షించాలని అధికారులకు తెలియజేశారు. సమీక్షలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమీషనర్ శ్రీనివాస రాజు గారు,డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వీరభద్ర రావు, అసిస్టెంట్ ఇంజనీర్ బాల కొండయ్య,జోగులాంబ ఆలయ ఈఓ ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:ఇంకెంత కాలం ఇంట్లో ఉండాలని పేచీ పెడుతున్నాడు?

ABOUT THE AUTHOR

...view details