జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం పెద్దంపేటలో... జిల్లెడు చెట్లపై మిడతలు వాలడం కలకలం రేపింది. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావటంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఇప్పటివరకు ఇలాంటి మిడతలు చూడలేదని వారు తెలిపారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మిడతల కలకలం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం పెద్దంపేట శివారులోని జిల్లెడు చెట్లపై మిడతలు వాలడంపై స్థానికుల్లో ఆందోళన రేకేత్తింది. మహారాష్ట్ర సరిహద్దు కావటం వల్ల ప్రజలు భయాందోళన చెందారు. ఇప్పటివరకు అలాంటి మిడతలని చూడలేదని స్థానికులు చెబుతున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మిడతల కలకలం
సమాచారం అందుకున్న వ్యవసాయ అధికారులు... పరిశీలించి స్థానిక మిడతలని తేల్చారు. ఫొటోలను శాస్త్రవేత్తలకు పంపించగా... వీటితో ఎలాంటి ప్రమాదం ఉండదని వారు స్పష్టం చేశారు.
ఇదీ చూడండి :'గాంధీలో జరుగుతున్న చికిత్సపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి'