తెలంగాణ

telangana

పారిశుద్ధ్య కార్మికులకు సరుకుల పంపిణీ

By

Published : Apr 27, 2020, 11:46 PM IST

ప్రభుత్వం విధించిన లాక్​డౌన్ నిబంధనలను పాటించి ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని స్టేషన్​ ఘనపూర్​ ఎమ్మెల్యే రాజయ్య సూచించారు. ఇంట్లో నుంచి బయటకు రాకపోవడమే మంచిదన్నారు.

groceries to sanitation workers in janagaon
పారిశుద్ధ్య కార్మికులకు సరుకుల పంపిణీ

జనగామ జిల్లా చిల్పూర్​ మండలం పల్లగుట్ట గ్రామంలో పారిశుద్ధ్య సిబ్బంది, ఆశా వర్కర్లకు ఎమ్మెల్యే రాజయ్య నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ప్రజలంతా భౌతిక దూరం పాటించాలని సూచించారు.

రంజాన్​ మాసం ప్రారంభమైనందున ముస్లింలంతా ఇళ్లలోనే ఉండాలని కోరారు. అనవసరంగా బయటకు రాకూడదన్నారు. లాక్​డౌన్​తో ఇబ్బందులు పడుతున్న వారికి సాయం చేసిన తెరాస నేత శ్రీధర్​ రావుకు కృతజ్ఞతలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details