తెలంగాణ

telangana

By

Published : May 4, 2020, 6:38 PM IST

ETV Bharat / state

కొండగట్టు వానరాలకు అరటిపండ్లు పెట్టిన యువకులు

లాక్​డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో జగిత్యాల జిల్లా కొడిమ్యాల పరిధిలో వానరాలు ఆకలితో అలమటిస్తున్నాయి. సమీప గంగాధర మండలానికి చెందిన యువకులు స్పందించి వాటికి అరటిపండ్లు సమకూర్చారు.

లాక్​డౌన్ కాలంలో వానరాల ఆకలి తీరుస్తున్న యువకులు
లాక్​డౌన్ కాలంలో వానరాల ఆకలి తీరుస్తున్న యువకులు

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నల్లగొండ పరిసరాల్లో వానరాలకు ఔత్సాహికులు పండ్లు పంపిణీ చేశారు. లాక్​డౌన్ మూలంగా కొండగట్టు పుణ్యక్షేత్రంలో భక్తులకు దర్శనం లేకపోవటం వల్ల వానరాలు సమీప గ్రామాలకు వలస వెళ్తున్నాయి. ఇందులో భాగంగా నల్లగొండ గుట్ట సమీపంలో వానరాలు ఆహారం లేక చెట్ల ఆకులు తింటూ పొట్ట నింపుకుంటున్నాయి.

స్పందించిన గంగాధర మండలానికి యువకులు వానరాలకు అరటిపళ్ళు అందజేశారు. వందల సంఖ్యలో వానరాలు ఒకే దగ్గరకు చేరుకుని అరటి పళ్ళు ఆరగించాయి.

ఇవీ చూడండి : శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జయంతి వేడుకలు ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details