తెలంగాణ

telangana

ధాన్యం కొనుగోలు కేంద్రాల ఎత్తివేతపై పొన్నం ఆందోళన

By

Published : Jan 5, 2021, 6:49 PM IST

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎత్తివేయడాన్ని నిరసిస్తూ జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో టీపీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ పొన్నం ప్రభాకర్​ గౌడ్​ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కొనుగోలు కేంద్రాలు లేక రైతులు ఇబ్బంది పడతున్నారని చెప్పారు.

congress leader ponnam prabhakar goud protest at kodimyala in kagityala dsitrict
ధాన్యం కొనుగోలు కేంద్రాల ఎత్తివేతపై పొన్నం ఆందోళన

జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ గౌడ్​ ఆధ్వర్యంలో కాంగ్రెస్​ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఎత్తివేతతో రైతులు ఇబ్బంది పడుతున్నారని పొన్నం అన్నారు.

లాక్​డౌన్ సమయంలో గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. నేడు యూటర్న్ తీసుకుందని విమర్శించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఎత్తివేత నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చారు. ఈ ఆందోళనలో టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం పాల్గొన్నారు.

ఇదీ చదవండి: ఈ నెల 13నే భారత్​లో వ్యాక్సినేషన్​ షురూ!

ABOUT THE AUTHOR

...view details