తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎంఎంటీఎస్ రైలు ఢీకొని యువకుడు మృతి

హైదరాబాద్ మలక్​పేట- డబ్బీర్​పురాలో మధ్యలో పట్టాలపై నడుచుకుంటూ వెళ్తున్న యువకుడిని ఎదురుగా వస్తున్న ఎంఎంటీఎస్ రైలు ఢీ కొట్టింది. అక్కడికక్కడే యువకుడు మృతిచెందాడు.

By

Published : Oct 23, 2019, 5:24 PM IST

ఎంఎంటీఎస్ రైలు ఢీకొని యువకుడు మృతి

హైదరాబాద్ మలక్​పేటలో దారుణం చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం 11 గంటల సమయంలో పట్టాలపై నడుచుకుంటూ వెళ్తున్న యువకుడిని ఎదురుగా వస్తున్న ఎంఎంటీఎస్ రైలు ఢీ కొట్టడం వల్ల అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాద సమయంలో రైలు డ్రైవర్ హారన్ కొట్టినా మృతుడు పక్కకు తప్పుకోలేదని వెల్లడించారు. యువకుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు. శవపరీక్ష అనంతరం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు కాచిగూడ రైల్వే పోలీసులు వెల్లడించారు.

ఎంఎంటీఎస్ రైలు ఢీకొని యువకుడు మృతి

ABOUT THE AUTHOR

...view details