తెలంగాణ

telangana

'అతని నుంచి ప్రాణహాని ఉంది... పోలీసులు కేసు నమోదు చేయట్లేదు'

By

Published : Nov 20, 2020, 6:45 AM IST

బోరబండ డివిజన్ తెరాస అభ్యర్థి బాబా ఫసియుద్దీన్ అనే వ్యక్తి తన అనుచరులతో కలిసి దాడి చేసేందుకు యత్నించారని ఆరోపిస్తూ.. ఓ మహిళ జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించింది.

women-allegations-on-trs-candidate-in-borabanda
'అతని నుంచి ప్రాణహాని ఉంది... పోలీసులు కేసు నమోదు చేయట్లేదు'

బోరబండలో స్థానికంగా నివాసముంటున్న షర్మిల జాదవ్ అనే మహిళ పోలీసులను ఆశ్రయించింది. బోరబండ డివిజన్ తెరాస అభ్యర్థి బాబా ఫసియుద్దీన్​ నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ఆరోపించింది. జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బెదిరింపులకు దిగుతున్నారని వ్యాఖ్యానించారు.

గతంలో కూడా ఇదే తరహాలో బెదిరింపులకు పాల్పడ్డరంటూ ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కేసు నమోదు చేయడం లేదని ఆవేదన వక్తం చేశారు. కేసు నమోదు చేసి ఫసియుద్దీన్‌ అతని అనుచరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చూడండి:'వికృత చేష్టలకు పాల్పడితే కఠిన చర్యలు'

ABOUT THE AUTHOR

...view details