ఎస్సీ, ఎస్టీలే కాకుండా అన్నివర్గాలూ నిర్వహించాలి
అంబేడ్కర్ ఒక్క ఎస్సీ, ఎస్టీలకే చెందినవారు కాదని ఆయన అందరివాడని రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సచివాలయంలో నిర్వహించిన రాజ్యంగ నిర్మాత జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ అన్ని వర్గాల అభ్యున్నతికి విశేష కృషిచేశారని హోంమంత్రి మహామూద్ అలీ అన్నారు. సచివాలయంలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేడ్కర్ 128వ జయంతి వేడుకల్లో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్తో కలిసి ఆయన పాల్గొన్నారు. రిజర్వేషన్లతో ఉన్నత పదవులు అనుభవించిన వారు సమాజం కోసం ఆలోచించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. అంబేడ్కర్ ఆశయాల కోసం పనిచేసినప్పుడే ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.