తెలంగాణ

telangana

By

Published : Sep 18, 2020, 3:30 PM IST

ETV Bharat / state

గ్రేటర్‌లో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లకు స్థలం చూపిస్తా : భట్టి

గత మున్సిపల్ ఎన్నికల్లో చూపించిన ఇళ్లనే ఇప్పుడు చూపిస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. లక్ష ఇళ్లు చూపిస్తామని ఇప్పటి వరకు కేవలం 3,428 ఇళ్లనే చూపించారన్నారు. ఇవాళ చూపించిన తుక్కుగూడ, రాంపల్లి ప్రాంతాలు జీహెచ్ఎంసీ పరిధిలోకి రావన్నారు. గ్రేటర్ పరిధిలో వందల ఎకరాల భూమి ఉందని... అక్కడ కట్టవచ్చని పేర్కొన్నారు.

Bhatti vikramarka
Bhatti vikramarka

జీహెచ్ఎంసీ పరిధిలో లక్ష డబుల్ బెడ్ రూమ్​ ఇళ్లను చూపిస్తామని ఇప్పటి వరకు కేవలం 3,428 ఇళ్లనే చూపించారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఇవాళ చూపించిన తుక్కుగూడ, రాంపల్లి ప్రాంతాలు జీహెచ్ఎంసీ పరిధిలోకి రావన్నారు. ఇళ్ల సందర్శనను అర్ధాంతరంగా నిలిపివేశారు.

గ్రేటర్ పరిధిలో వందల ఎకరాల భూమి ఉందిని... అక్కడ కట్టవచ్చని భట్టి పేర్కొన్నారు. స్థలాలు చూపించేందుకు తాము సిద్ధమని స్పష్టం చేశారు. గత మున్సిపల్ ఎన్నికల్లో చూపించిన ఇళ్లనే ఇప్పుడు చూపిస్తున్నారని విమర్శించారు.

గ్రేటర్‌లో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లకు స్థలం చూపిస్తా : భట్టి

ఇదీ చదవండి :ఇళ్ల సందర్శనను అర్ధాంతరంగా నిలిపివేసిన కాంగ్రెస్

ABOUT THE AUTHOR

...view details