సరస్వతీ దేవి జన్మ దినోత్సవం సందర్భంగా నిర్వహించే వసంత పంచమి వేడుకలు హైదరాబాద్ శంకర్ మఠంలోని శృంగేరి శారదాంబ దేవాలయంలో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారు సరస్వతీ దేవి అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు.
శారదాంబ ఆలయంలో ఘనంగా వసంత పంచమి వేడుకలు
హైదరాబాద్లోని పలు అమ్మవారి ఆలయాల్లో వసంత పంచమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళా భక్తులతో ఆలయాలు కళకళలాడాయి.
శారదాంబ ఆలయంలో ఘనంగా వసంత పంచమి వేడుకలు
వసంత పంచమిని పురస్కరించుకుని నగరం నలుమూలల నుంచి మహిళలు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చారు. ఒకరికొకరు పరస్పరం పసుపు, కుంకుమలు ఇచ్చి పుచ్చుకుని.. ముత్తైదుగా ఉండాలని ఆశీర్వదించుకున్నారు. ఈ సందర్భంగా తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు.
ఇదీ చూడండి :ఆ నిచ్చెన ఎందుకు నడిచింది? ఆ ఫొటోలో ఉన్నవి దెయ్యాలా?