ప్రతీ పౌరుడికి వైద్య పరీక్షలు నిర్వహించి తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ను రూపొందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ప్రజా వైద్యాన్ని మెరుగుపరిచేందుకు ఈ ఏడాది బడ్జెట్లో రూ.6,186 కోట్లు కేటాయించారు.
అత్యుత్తమ వైద్య సేవల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మూడో స్థానంలో నిలిచినట్లు నీతి ఆయోగ్ నివేదికలో వెల్లడించిందని అన్నారు. కంటి వెలుగు తరహాలోనే చెవి, ముక్కు, గొంతు, దంత సంబంధమైన వ్యాధుల నిర్ధరణ కోసం ప్రత్యేక కార్యాచరణను ప్రారంభించనున్నామని వెల్లడించారు.