తెలంగాణ

telangana

విద్యార్థులను సెల్​ఫోన్లకు దూరంగా ఉంచండి: నైనా జైస్వాల్

చంపాపేట్ త్రివేణి హై స్కూల్​లో నిర్వహించిన వార్షికోత్సవ కార్యక్రమంలో విద్యార్థులు చేసిన నృత్యాలు, ఆటపాటలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ పాల్గొన్నారు.

By

Published : Feb 16, 2020, 11:24 AM IST

Published : Feb 16, 2020, 11:24 AM IST

Updated : Feb 16, 2020, 11:33 AM IST

triveeni school annual day celebrations
త్రివేణి హై స్కూల్​ వార్షికోత్సవ కార్యక్రమం

జీవితంలో ఎదగాలంటే కష్టపడి చదవడం కాదు... ఇష్టపడి చదవాలని నైనా జైస్వాల్ విద్యార్థులకు సూచించారు. హైదరాబాద్ చంపాపేట్ త్రివేణి హై స్కూల్​లో జరిగిన వార్షికోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులను సెల్ ఫోన్లకు దూరంగా ఉంచాలని తలిదండ్రులకు విజ్జప్తి చేశారు.

పదో తరగతిలో మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులకు రూ.25 వేలు చొప్పున పారితోషకాన్ని నైనా జైస్వాల్ చేతుల మీదగా అందజేశారు. జైస్వాల్ ఈ కార్యక్రమానికి రావడం చాల సంతోషంగా ఉందని స్కూల్ ప్రిన్సిపాల్ గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు, ఆటపాటలు అందర్నీ ఆలకట్టుకున్నాయి. కార్పొరేటర్ రమణ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు.

త్రివేణి హై స్కూల్​ వార్షికోత్సవ కార్యక్రమం

ఇదీ చూడండి:తల్లి మృతితో చలించిపోయాడు.. అంతలోనే భార్యతో సహా చనిపోయాడు!

Last Updated : Feb 16, 2020, 11:33 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details