తెలంగాణ

telangana

ETV Bharat / state

నలుగురు సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీ

తెలంగాణలో నలుగురు ఐపీఎస్ అధికారుల బదిలీ జరిగింది. వీకే సింగ్​ను రాష్ట్ర పోలీసు అకాడమీ సంచాలకులుగా, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్​గా గోపికృష్ణను, ఫైర్ సర్వీస్ డీజీగా సంజయ్ కుమార్​ను, సంతోష్ మెహ్రాను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

By

Published : Sep 18, 2019, 12:03 AM IST

నలుగురు సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీ

నలుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రింటింగ్ కమిషనర్​గా ఉన్న వీకే సింగ్​ను రాష్ట్ర పోలీస్ అకాడమీ సంచాలకులుగా నియమించారు. ఆ స్థానంలో ఉన్న సంతోష్ మెహ్రాను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. సంజయ్ కుమార్ జైన్​ను అగ్నిమాపక శాఖ డీజీగా బదిలీ చేశారు. ఆ స్థానంలో ఉన్న గోపీకృష్ణను ప్రింటింగ్, స్టేషనరీ కమిషనర్​గా బదిలీ చేశారు. ఐపీఎస్​ల బదిలీలు జరుగుతాయని గత రెండు మూడు నెలల నుంచి పోలీస్ శాఖలో చర్చ జరుగుతోంది. ఇప్పటికే పదోన్నతి పొందిన పలువురు ఉన్నతాధికారులు పాత స్థానాల్లోనే కొనసాగుతున్నారు. వాళ్లను కూడా బదిలీ చేసి పోస్టింగులు ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం సీనియర్ ఐపీఎస్​ల బదిలీలు జరిగిన తరుణంలో మిగతా ఐపీఎస్​ల బదిలీలు కూడా జరిగే అవకాశం ఉందని సమాచారం.

నలుగురు సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీ

ABOUT THE AUTHOR

...view details