కరోనా వ్యాప్తి నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న జనతా కర్ఫ్యూను విజయవంతం చేయాలని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు కారెం రవీందర్ రెడ్డి కోరారు. తెలంగాణలో పనిచేస్తున్న గెజిటెడ్ అధికారులు, కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు... ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6గంటల వరకు ఇళ్లకే పరిమితం కావాలని విజ్ఞప్తి చేశారు.
'ఉద్యోగులందరూ జనతా కర్ఫ్యూలో పాల్గొనాలి'
ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ పిలుపు మేరకు జనతా కర్ఫ్యూలో ఉద్యోగులందరూ పాల్గొనాలని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు కారెం రవీందర్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు ఇంటికే పరిమితం కావాలని సూచించారు.
కరోనా కట్టడికి జనతా కర్ఫ్యూ
ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఉద్యోగులందరు తమ కుటుంబ సభ్యులతో... ఇంటి బయట నిల్చుని చప్పట్లు కొడుతూ... ఐక్యతతో కరోనాను అడ్డకుంటామని తెలపాలన్నారు. మన గురించి, మన కుటుంబసభ్యులు, రాష్ట్ర, దేశ భవిష్యత్తును కాపాడుకోవడం కోసం దీనిని తప్పనిసరిగా పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి :'జనతా కర్ఫ్యూను జయప్రదం చేద్దాం'