కరోనా ప్రభావంతో ఏపీలోని తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలను మే 31 వరకు రద్దు చేస్తున్నట్లు తితిదే ప్రకటించింది. లాక్డౌన్ కారణంగా మే 3 వరకు దర్శనాలను పూర్తిగా రద్దు చేసిన తితిదే.. ఆర్జిత సేవలను ఏకాంతంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.
ఈ నెలాఖరు వరకు తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు రద్దు - తిరుమల దర్శనాలు రద్దు
మే 31 వరకు తిరుమల తిరుపతి శ్రీవారి ఆర్జిత సేవలకు అనుమతి లేదని తితిదే ప్రకటించింది. కరోనా నేపథ్యంలో స్వామివారి ఆర్జిత సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నట్లు తెలిపింది. ఇప్పటికే మే 3 వరకు దర్శనాలను పూర్తిగా రద్దు చేసింది తితిదే.

ఈ నెలాఖరు వరకు తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు రద్దు
ఆన్లైన్, పోస్టాఫీసు ద్వారా టిక్కెట్లు పొందిన భక్తులకు వాటిని రద్దు చేసుకునే అవకాశం కల్పించింది. భక్తులు.. వారి టిక్కెట్ల వివరాలతో పాటు బ్యాంకు ఖాతా నెంబరు, ఐఎఫ్ఎస్సీ కోడ్ను helpdesk@tirumala.orgకు పంపాలని కోరింది తితిదే. వివరాలను పరిశీలించి రీఫండ్ నగదు వారి ఖాతాల్లో జమ చేస్తామని దేవస్థానం అధికారులు తెలిపారు.