సీఎం కేసీఆర్ 30శాతం పీఆర్సీ ప్రకటించడంతో... నాంపల్లిలోని హైదరాబాద్ కలెక్టరేట్లో తెలంగాణ గెజిటెడ్ అధికారులు సంబురాలు చేశారు. అనుకున్న దానికంటే ఎక్కువగానే ముఖ్యమంత్రి పీఆర్సీ ప్రకటించారని టీఎన్జీవో అధ్యక్షుడు కృష్ణయాదవ్ తెలిపారు.
పీఆర్సీ ప్రకటనపై.. ఉద్యోగుల సంబురాలు
సీఎం కేసీఆర్ పీఆర్సీ ప్రకటనపై తెలంగాణ గెజిటెడ్ అధికారులు సంఘం ఆనందం వ్యక్తం చేశారు. నాంపల్లిలోని హైదరాబాద్ కలెక్టరేట్లో సంబురాలు జరుపుకున్నారు.
కలెక్టరేట్ కార్యాలయంలో సంబరాలు
ముఖ్యమంత్రి నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా... ఉద్యోగులు, అధికారులు స్వీట్లు పంచుకుని టపాసులు పేల్చి ఆనందం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:బడుల మూసివేతకు ప్రతిపాదన.. త్వరలోనే ప్రకటన